ముంబై: బ్యాటింగ్ ఆర్డర్లో 10,11వ స్థానాల్లో బరిలోకి దిగిన ముంబై బ్యాటర్లు తనుశ్ (120 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), తుషార్ దేశ్ పాండే (123; 10 ఫోర్లు, 8 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగడంతో ముంబై జట్టు రంజీ ట్రోఫీ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. 1946 తర్వాత లిస్ట్ ఏ క్రికెట్లో చివరి రెండు స్థానాల్లో బరిలోకి దిగిన బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇదే తొలిసారి.
వీరిద్దరూ 10 వికెట్కు 232 పరుగులు జోడించడం విశేషం. 78 ఏండ్ల క్రితం సర్రే జట్టుతో జరిగిన పోరులో భారత ఆటగాళ్లు సీటీ సర్వతే (124*), ఎస్ఎన్ బెనర్జీ (121) శతకాలు బాదారు. బరోడాతో మంగళవారం ముగిసిన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో ముంబై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి సెమీస్లో అడుగుపెట్టింది. ముంబై మొదటి ఇన్నింగ్స్లో 384 రన్స్ చేయగా.. బరోడా 348 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో ముంబై 569 రన్స్ కొట్టింది.