హైదరాబాద్, ఆట ప్రతినిధి: పుణె వేదికగా జరుగుతున్న 21వ జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రాష్ట్ర ఎస్సీ గురుకుల విద్యార్థి రవికిరణ్ కాంస్య పతకంతో మెరిశాడు. సోమవారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో రవికిరణ్ 34.83మీటర్ల దూరంతో మూడో స్థానంలో నిలిచాడు. పోటీ ప్రారంభం నుంచే నిలకడైన ప్రదర్శన కొనసాగించిన రవి..ప్రత్యర్థులకు దీటైన పోటీనివ్వడంలో సఫలమయ్యాడు. ప్రస్తుతం గురుకులాలకు చెందిన షేక్పేటలోని ఎల్ఏసీసీ(లాంగ్టర్మ్ అథ్లెటిక్స్ కోచింగ్ కేంద్రం)లో రవి శిక్షణ తీసుకుంటున్నాడు. జాతీయ పారా అథ్లెటిక్స్ టోర్నీలో పతకం సాధించిన కిరణ్ను కోచ్లు నాగపురి రమేశ్, షాజి, నాగరాజు తదితరులు అభినందించారు.