హైదరాబాద్, ఆట ప్రతినిధి: విశాఖపట్నం వేదికగా జరిగిన ఇండియన్ గోల్ఫ్ యూనియన్(ఐజీయు) టోర్నీలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు చెందిన గోల్ఫర్లు సత్తాచాటారు. మొత్తంగా ఆరు పతకాలతో మెరిశారు.
ముకుల్, అమూల్య స్వర్ణ పతకాలతో మెరువగా, అఖిల, మధు రన్నరప్ దక్కించుకున్నారు. బాలుర, బాలికల క్యాటగిరీలో అనూష, ప్రిసెల్లా కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. క్యాటగిరీ-సీలో హైదరాబాద్ గోల్ఫర్ సాత్విక్కుమార్ సింగ్ అగ్రస్థానం దక్కించుకున్నాడు.