బళ్లారి: కర్నాటకలోని బళ్లారి వేదికగా జరుగుతున్న జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన సావియో డొమినిక్ మైఖేల్ (54 కేజీలు) క్వార్టర్స్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం ఇక్కడ జరిగిన తొలి బౌట్లో మాజీ ప్రపంచ చాంపియన్షిప్ కాంస్య విజేత గౌరవ్ బిధూరీని మైఖేల్ చిత్తు చేశాడు. అదే జోరులో ప్రిక్వార్టర్స్ పోరులో మైఖేల్ 4-1 తేడాతో జార్ఖండ్ బాక్సర్ కృష్ణ జోరాపై ఘన విజయం సాధించాడు. తెలంగాణకే చెందిన వేణు మండలా..నిఖిల్ దూబే(మహారాష్ట్ర) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మిగతా బౌట్లలో అశోక్ పాటిల్(గోవా), కుల్దీప్ కుమార్(చండీగఢ్), నిఖిల్ దూబే(మహారాష్ట్ర) క్వార్టర్స్లోకి ప్రవేశించగా, శివ తాపా ప్రిక్వార్టర్స్కి వెళ్లాడు.