నెక్స్ జెన్ ఉమెన్స్ టీ20 ట్రోఫీని సెంటర్ ఫర్ క్రికెట్ (సీఎఫ్సీ) ఎక్సలెన్స్ అకాడమీ జట్టు గెలుచుకుంది. ఆదివారం కోచింగ్ బియాండ్ (సీబీ) జట్టుతో ముగిసిన ఫైనల్లో సీఎఫ్సీ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
ఆ జట్టు విజయంలో ఆల్రౌండర్ జి.త్రిషా కీలకపాత్ర పోషించింది. ఈ టోర్నీలో ఆమె 310 పరుగులతో పాటు 11 వికెట్లు తీసి మోస్ట్ వాల్యుబల్ ప్లేయర్ అవార్డు దక్కించుకుంది.