Asia Cup 2023 : ఆసియా కప్(Asia Cup 2023)లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కోసం కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. టీ20 వరల్డ్ కప్(T20 World Cup 2022) తర్వాత దాయాదులు మొదటిసారి తలపడుతున్న ఈ సమరంలో గెలుపు ఎవరిది? అనే ఉత్కంఠ నెలకొంది. ఈ సమయంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు టామ్ మూడీ(Tom Moody) ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘భారత్, పాక్ మ్యాచ్కు ఓ ప్రేమకథ ఉంది. ఈ రెండు దేశాల్లో క్రికెట్కు అభిమానులు ఎక్కువ. నిజం చెప్పాలంటే.. నా దృష్టిలో యాషెస్ సిరీస్(Ashes series) కంటే ఈ దాయాదుల పోరు చాలా గొప్పది’ అని అన్నాడు.
‘పాకిస్థాన్ జట్టును చూస్తే ప్రతిభావంతులతో సమతూకంగా కనిపిస్తోంది. పాక్ స్పీడ్స్టర్ షాహీన్ ఆఫ్రీది(Shaheen Afridi) భారత్కు అత్యంత ప్రమాదకారిగా మారే అవకాశం ఉంది. . కొత్త బంతితో అతను ఇండియా టాపార్డర్ను బెంబేలెత్తించడగలడు. ప్రస్తుత జట్టు టీమిండియాకు గట్టి పోటీ ఇవ్వగలదు. అయితే.. భారత జట్టు బ్యాటింగ్ విభాగం కూడా బలోపేతంగా ఉంది. దాంతో, ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా జరుగనుంది’ అని మూడీ అభిప్రాయ పడ్డాడు.
టామ్ మూడీ, షాహీన్ ఆఫ్రీది
ఆసియా కప్ పోటీలకు రేపటితో తెరలేవనుంది. హైబ్రిడ్ మోడల్(Hybrid Model)లో జరుగుతున్న ఈ టోర్నీకి శ్రీలంక, పాకిస్థాన్ సుంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. టోర్నీ మొత్తానికే హైలైట్ అయిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ సెప్టెంబర్ 2న ఉంది. నిరుడు ఆసియా కప్లో దాయాదులు రెండుసార్లు తలపడ్డాయి. అయితే.. చెరొకసారి పైచేయి సాధించారు. దాంతో, ఈసారి ఎవరు విజయం సాధిస్తారు? అనేది ఆసక్తిగా మారింది. ఈమధ్య టీ20 వరల్డ్ కప్(T20 World Cup)లో భారత్, పాక్ ఢీ కొన్నాయి. ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ(82 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్ ఆడడంతో ఇండియా ఆఖరి బంతికి విజయం సాధించింది. దాంతో, ఈసారి కూడా కోహ్లీ పాక్ బౌలర్లను ఉతికి ఆరేస్తాడని అభిమానులు చర్చించుకుంటున్నారు.