కాన్పూర్: న్యూజిలాండ్ ఓపెనర్ టామ్ లాథమ్ తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. 95 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అక్షర్ పటేల్ బౌలింగ్లో స్టంప్ ఔటయ్యాడు. కాన్పూర్లో జరుగుతున్న తొలి టెస్టులో మూడవ రోజు ఇండియన్ బౌలర్లు కాస్త రాణించారు. అక్షర్ పటేల్ ఇప్పటి వరకు మూడు వికెట్లు తీసుకోగా.. ఉమేశ్ యాదవ్, అశ్విన్, జడేజాలు చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కడపటి వార్తలు అందేసరికి.. న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్లో 111 ఓవర్లలో ఆరు వికెట్లకు 241 రన్స్ చేసింది. బ్లండెల్, జేమిసన్ క్రీజ్లో ఉన్నారు. ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో 345 రన్స్ చేసి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.