టోక్యో: టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్లో భారత ఆటగాళ్లు దూసుకుపోతున్నారు. బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్లో తరుణ్ ధిల్లాన్ సెమీఫైనల్కు అర్హత సాధించాడు. కొరియాకు చెందిన షిన్ యుంగ్ వాన్తో జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో 21-18, 15-21, 21-17తో గెలుపొందాడు. దీంతో పారాలింపిక్స్ సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. ఇక బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ గ్రూప్ స్టేజ్లో సుహాస్ యతిరాజ్ విజయం సాధించాడు. 21-6, 21-12 పాయింట్ల తేడాతో ఇండోనేషియాకు చెందిన సుసాంతో హారీపై గెలుపొందాడు.
అదేవిధంగా కనోయి స్ప్రింట్ మహిళల 200 మీటర్ల విభాగంలో ప్రాచి యాదవ్ ఫైనల్లో అడుగుపెట్టింది.