న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహై (65 కిలోలు) నేరుగా ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ (ఏఐబీఏ) టోర్నీకి ఎంపికైంది. ఈ మేరకు భారత బాక్సింగ్ సమాఖ్య(బీఎఫ్ఐ) మంగళవారం నిర్ణయం తీసుకుంది. టోక్యో విశ్వక్రీడల్లో పతకం సాధించడంతో జాతీయ టోర్నీలో పోటీపడకుండానే ప్రపంచ టోర్నీకి లవ్లీనా అర్హత సాధించింది. హిస్సార్లో ఈనెల 21 నుంచి మొదలయ్యే జాతీయ చాంపియన్షిప్లో స్వర్ణ, రజత పతక విజేతలతో కలిసి 24 ఏండ్ల లవ్లీనా.. ప్రపంచ పోటీల్లో పాల్గొననుంది. ఏఐబీఏ ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్ ఇస్తాంబుల్ వేదికగా డిసెంబర్లో జరుగనుంది.