ఐడబ్ల్యూఎఫ్ అధికారిక ప్రకటన
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్లో భారత స్టార్ వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను(49కిలోలు) బెర్తు ఖరారు చేసుకుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ వెయిట్లిఫ్టింగ్ సమాఖ్య(ఐడబ్ల్యూఎఫ్) శనివారం అధికారికంగా ప్రకటించింది. తాష్కెంట్లో జరిగిన ఆసియా చాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించడం ద్వారా మీరా..విశ్వక్రీడలకు అర్హత సాధించింది. ఐడబ్ల్యూఎఫ్ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో ఈ మణిపూర్ వెయిట్లిఫ్టర్ 413,36172 పాయింట్లతో రెండో ర్యాంక్లో ఉంది. ఇంతకుముందు నాలుగో ర్యాంక్లో ఉన్న మీరా..ఉత్తరకొరియా ఒలింపిక్స్ నుంచి తప్పుకోవడంతో రెండో ర్యాంక్కు ఎగబాకింది.