బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న టీమ్ఇండియా.. విండీస్తో మరోపోరుకు సిద్ధమైంది. ఇప్పటికే వన్డే సిరీస్ చేజిక్కించుకున్న భారత్.. నేడు రెండో టీ20లో కరీబియన్లతో అమీతుమీ తేల్చుకోనుంది. విశ్వవ్యాప్తంగా లీగ్ల్లో అదరగొట్టే విండీస్ హార్డ్ హిట్టర్లు ఈ సారైనా సమిష్టిగా సత్తాచాటి.. రోహిత్ సేనకు కనీస పోటీనిస్తారా చూడాలి!
న్యూఢిల్లీ: వెస్టిండీస్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేసి.. పొట్టి ఫార్మాట్లో బోణీ కొట్టిన టీమ్ఇండియా.. రెండో మ్యాచ్కు సిద్ధమైంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా సోమవారం భారత్, విండీస్ మధ్య రెండో టీ20 జరుగనుంది. తొలి మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ నిలకడకు.. దినేశ్ కార్తీక్ మెరుపులు తోడవడంతో సునాయాసంగా గెలుపొందిన టీమ్ఇండియా.. రెండో మ్యాచ్లోనూ అదే జోరు కొనసాగాంచాలని చూస్తున్నది. ఈ ఏడాది ఆఖర్లో ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్ కోసం తుది జట్టును ఎంపిక చేసేందుకు ఈ సిరీస్ను ఉపయోగించుకోవాలని భారత మేనేజ్మెంట్ ఆశిస్తుండగా.. సొంతగడ్డపై తమకు అచ్చొచ్చిన ఫార్మాట్లోనైనా సత్తాచాటాలని కరీబియన్లు కాచుకొని ఉన్నారు. గత మ్యాచ్లో రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన సూర్యకుమార్ మరోసారి ఓపెనర్గా వచ్చే అవకాశాలున్నాయి. లేటు వయసులో ఘాటు ఆటతో అదరగొడుతున్న దినేశ్ కార్తీక్.. టీమ్ఇండియాకు ప్రపంచకప్ అందించడమే తన లక్ష్యం అని ఇప్పటికే స్పష్టం చేయగా.. రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్ రూపంలో జట్టులో కావాల్సినంత మంది ఆల్రౌండర్లు ఉన్నారు.ఇక బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్తో పాటు నయా సంచలనం అర్శ్దీప్ అదుర్స్ అనిపిస్తున్నాడు. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అవసరమైనప్పుడల్లా బంతిని అందుకుంటుండటం జట్టుకు కలిసొచ్చే అంశం కాగా.. అశ్విన్, జడేజా, బిష్ణోయ్ స్పిన్ బాధ్యతలు మోయనున్నారు.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), సూర్యకుమార్, శ్రేయస్, పంత్, పాండ్యా, కార్తీక్, జడేజా, అశ్విన్, రవి, భువనేశ్వర్, అర్శ్దీప్.
వెస్టిండీస్: పూరన్ (కెప్టెన్), మయేర్స్, బ్రూక్స్, పావెల్, హెట్మైర్, హోల్డర్, హుసేన్, స్మిత్, పాల్, జోసెఫ్, మెక్కాయ్.