న్యూఢిల్లీ: సీనియర్ల గైర్హాజరీలో భారత జట్టు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు సిద్ధమైంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం ఇరు జట్ల మధ్య తొలి టీ20 జరుగనుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతినివ్వడంతో ఈ సిరీస్కు కేఎల్ రాహుల్ నాయకుడిగా వ్యవహరించాల్సి ఉన్నా.. చివరి నిమిషంలో అతడు గాయం కారణంగా దూరమవడంతో రిషబ్ పంత్ను సారథిగా ఎంపిక చేశారు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ను నడిపించిన అనుభవం ఉన్న పంత్.. జట్టును ఎలా ముందుకు తీసుకెళ్తాడో చూడాలి. ప్రపంచ రికార్డు స్థాయిలో వరుసగా 12 టీ20ల్లో నెగ్గి ఫుల్ జోష్లో ఉన్న టీమ్ఇండియాను.. దక్షిణాఫ్రికా జట్టు ఏమేరకు నిలువరిస్తుందనేది ఆసక్తికరం. గజ్జల్లో గాయం కారణంగా కేఎల్ రాహుల్ చివరి నిమిషంలో తప్పుకోగా.. భవిష్యత్తు కెప్టెన్గా భావిస్తున్న పంత్ను యాజమాన్యం సారథిగా ప్రకటించింది. మరోవైపు చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ కుడి చేతి గాయంతో పూర్తి సిరీస్కు దూరమయ్యాడు. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన పొట్టి ప్రపంచకప్ తర్వాత ఇప్పటి వరకు టీ20 మ్యాచ్ ఆడని దక్షిణాఫ్రికా జట్టు.. ఈ సిరీస్ను ఆసీస్ వేదికగా జరిగే ప్రపంచకప్నకు సన్నాహకంగా వినియోగించుకోవాలని చూస్తున్నది. సఫారీ జట్టు గతం కంటే భిన్నంగా కనిపిస్తున్నది. డేవిడ్ మిల్లర్, డికాక్, మార్క్మ్,్ర డసెన్, రబడ వంటి వాళ్లు ఐపీఎల్లో ఆడి ఇక్కడి వాతావరణానికి అలవాటు పడి ఉన్నారు.