ప్రొ కబడ్డీ లీగ్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో బోణీ కొట్టాలని చూస్తున్న తెలుగు టైటాన్స్కు వరుసగా మూడో మ్యాచ్లోనూ నిరాశ ఎదురైంది. మంగళవారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్ 37-39తో హర్యానా స్టీలర్స్ చేతిలో పరాజయం పాలైంది. టైటాన్స్ తరఫున సిద్ధార్థ్ దేశాయ్ (9 పాయింట్లు), అంకిత్ (9), రాకేశ్ గౌడ (7) సత్తాచాటగా.. హర్యానా తరఫున మీటు (12), రోహిత్ గులియా (8) రాణించారు. తాజా సీజన్లో తొలి మ్యాచ్ను ‘డ్రా’ చేసుకున్న టైటాన్స్.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడి ప్రస్తుతం 5 పాయింట్లతో పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో ఉంది. మరో మ్యాచ్లో పట్నా పైరెట్స్ 38-26తో పుణెరి పల్టన్పై గెలుపొందింది. కరోనా కారణంగా ఖాళీ స్టేడియంలో జరుగుతున్న మెగా లీగ్లో నేడు దబంగ్ ఢిల్లీతో బెంగాల్ వారియర్స్.. యూపీ యోధాతో గుజరాత్ జెయింట్స్ తలపడనున్నాయి.