న్యూఢిల్లీ: థామస్ కప్ జోష్తో కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ చిరాగ్ శెట్టి ధీమా వ్యక్తం చేశాడు. 2018 కామన్వెల్త్ ప్రదర్శనను మరోసారి చేసి పురుషుల డబుల్స్లో మరో స్వర్ణం చేజిక్కించుకుంటానని అన్నాడు.
ఇన్నాళ్లు తీరని కలగా మిగిలిన థామస్ కప్ను భారత్కు అందించడంలో డబుల్స్లో చిరాగ్ శెట్టి, సాత్విక్సాయిరాజ్ జోడీ కీలక పాత్ర పోషించింది. తదుపరి లక్ష్యాల గురించి చిరాగ్ మీడియాతో మాట్లాడాడు. ‘ఇంకా థామస్ కప్ ఆనందంలోనే ఉన్నా. తదుపరి లక్ష్యాలు చేరుకునేందుకు తిరిగి శిక్షణకు వెళ్లాల్సిన సమయం వచ్చింది. కామన్వెల్త్తో మొదలై ప్రపంచ చాంపియన్షిప్, ఆసియా క్రీడలకు సిద్ధం కావాల్సి ఉంది’ అని చిరాగ్ అన్నాడు.