Uppal Stadium | ఉప్పల్ స్టేడియం వేదికగా బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్ – సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో 2,500 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్టు రాచకొండ పోలీసు కమిషనర్ తరుణ జోషి పేర్కొన్నారు. స్టేడియం వద్ద 360 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. స్టేడియం సీటింగ్ సామర్థ్యం 39 వేలు ఉందని, స్టేడియం లోపల, వెలుపల భారీగా పోలీసులను మోహరిస్తామని సీపీ స్పష్టం చేశారు.
ఇక మ్యాచ్ను వీక్షించేందుకు వచ్చే అభిమానులు ల్యాప్ ట్యాప్, వాటర్ బాటిల్స్, బ్యానర్స్, లైటర్స్, సిగరెట్స్, బైనాక్యులర్స్ తీసుకురావొద్దని, వాటిపై నిషేధం విధించామని సీపీ తెలిపారు. కేవలం బ్లూటూత్స్ అనుమతిస్తామన్నారు. స్టేడియం పరిసరాల్లో షీ టీమ్స్ నిఘా ఉంటుందని పేర్కొన్నారు. మ్యాచ్ ప్రారంభానికి మూడు గంటల ముందు నుంచే స్టేడియం లోపలికి ప్రేక్షకుల్ని అనుమతిస్తామని చెప్పారు. టికెట్ కొనుగోలు చేసిన వారి కోసం పార్కింగ్ సదుపాయం కల్పించామని తెలిపారు. స్టేడియం వద్ద బ్లాక్ టికెట్స్ అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.