హైదరాబాద్ : ఈ నెల 19, 20వ తేదీల్లో హుస్సేన్ సాగర్ తీరాన ఇండియన్ రేసింగ్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో లీగ్కు సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్కు రెండు రకాల పాసులను జారీ చేస్తున్నారు. రెగ్యులర్, వీకెండ్ పాస్ పేరిట విక్రయిస్తున్నారు. రెగ్యులర్ పాస్ అయితేనేమో ఒక రోజుకు మాత్రమే వర్తిస్తుంది. దీని ఖరీదు రూ. 749. వీకెండ్ పాస్ అయితేనేమో రెండు రోజులకు వర్తిస్తుంది. దీని ధర రూ. 1,249. లీగ్ను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే వారు బుక్ మై షోలో టికెట్లు కొనుగోలు చేయవచ్చని నిర్వహకులు పేర్కొన్నారు. టికెట్ల బుకింగ్స్, ఇతర విషయాల కోసం https://in.bookmyshow.com/hyderabad/sports/indian-racing-league-weekend-pass/ET00343449 ఈ వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు.
దేశంలో తొలిసారి తీసుకొస్తున్న స్ట్రీట్ సర్యూట్ రేసుల్లో ఆరంభ ఎడిషన్ వేదికలు ఖరారయ్యాయి. ఈ నెల 14న చెన్నైలోని మద్రాస్ ఇంటర్నేషనల్ సర్యూట్లో ప్రి సీజన్ టెస్టు జరుగనుంది. ఆ తర్వాత 19, 20 తేదీల్లో హుసేన్సాగర్ పరిసర ప్రాంతాల్లో ఇండియన్ రేసింగ్ లీగ్కు తెరలేవనుంది. చెన్నైల్లో నవంబర్(25, 27 తేదీల్లో), డిసెంబర్(2, 4తేదీల్లో) రేసు జరుగనుంది.
హైదరాబాద్లో డిసెంబర్ 10, 11తేదీల్లో జరిగే రేస్తో లీగ్ ముగియనుంది. దేశంలో ప్రధాన నగరాల సమాహారంగా ఐదు జట్లను ఎంపిక చేశారు. ఇందులో హైదరాబాద్ బ్లాక్బర్డ్స్, గోవా ఏసెస్, చెన్నై టర్బోరైడర్స్, బెంగళూరు స్పీడ్స్టర్స్, స్పీడ్ డిమాన్స్ ఢిల్లీ జట్లు పోటీలో ఉన్నాయి. హైదరాబాద్ జట్టులో కొండా ఆనందిత్రెడ్డితో పాటు నీల్ జానీ, అఖిల్ రవీంద్ర, లోలా లోవిన్ఫోసి ఉన్నారు. మొత్తంగా లీగ్లో భారత్తో పాటు మిగతా దేశాల నుంచి 24 మంది రేసర్లు లీగ్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.