INDvsSA 2nd Test: భారత్ – దక్షిణాఫ్రికా మధ్య కేప్టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇరు జట్ల బౌలర్లు వికెట్ల పండుగ చేసుకున్నారు. రెండు జట్లు ఒక మారు ఆలౌట్ అవడమే గాక రెండో ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో ఒక్క రోజే 23 వికెట్లు నేలకూలాయి. బౌలర్లు విజృంభించిన తొలి రోజుపై టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఇది నమ్మశక్యంగా లేదని, తాను ఫ్లైట్ ఎక్కి ఇంటికి వచ్చేలోపే ఓ జట్టు ఆలౌట్ అయిందని ఎక్స్ (ట్విటర్) వేదికగా రాసుకొచ్చాడు.
తొలి రోజు మ్యాచ్ ముగిసిన తర్వాత సచిన్ ట్విటర్లో స్పందిస్తూ… ‘2024లో క్రికెట్ ఒకే రోజు 23 వికెట్లు నేలకూలడంతో మొదలైంది. ఇది నమ్మశక్యంగా లేదు. సౌతాఫ్రికా ఆలౌట్ అయినప్పుడు నేను ఫ్లైట్ ఎక్కాను. ఇప్పుడు (తొలి రోజు ఆట ముగిసేటప్పటికీ) ఇంటికొచ్చి టీవీలో మ్యాచ్ చూద్దామని చూస్తే సౌతాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయిందని కనబడుతోంది. ఈ గ్యాప్లో నేను ఏం మిస్ అయ్యాను..?’ అని రాసుకొచ్చాడు. సచిన్ ట్వీట్పై నెటిజన్లు కూడా ఫన్నీ మీమ్స్తో కామెంట్స్ చేస్తున్నారు.
Cricket in ‘24 begins with 23 wickets falling in a single day.
Unreal!
Boarded a flight when South Africa was all out, and now that I’m home, the TV shows South Africa has lost 3 wickets.
What did I miss?#SAvIND— Sachin Tendulkar (@sachin_rt) January 3, 2024
కేప్టౌన్ టెస్టులో తొలి రోజు టాస్ గెలిచిన సఫారీలు మొదట బ్యాటింగ్ ఎంచుకున్నారు. మహ్మద్ సిరాజ్ (6-15) తో పాటు బుమ్రా, ముఖేశ్ కుమార్ల ధాటికి సౌతాఫ్రికా విలవిల్లాడింది. ఆ జట్టు తొలి సెషన్ కూడా ఆడకుండానే 55 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన భారత్ కూడా తడబడింది. 32 ఓవర్లలో 152-4గా ఉన్న భారత స్కోరు.. 34.5 ఓవర్లలో 153పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా చివరి ఆరుగురు బ్యాటర్లు ఒక్క పరుగు కూడా చేయకుండా పెవిలియన్ చేరారు. అనంతరం రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు వచ్చిన సఫారీలు.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 17 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేశారు.
You missed this Sir …
A Bizarre New Record : 27 times players batted on Day 1 in Cape Town:
Virat Kohli is the top scorer out of all the 27.#WTC25 | 📝#SAvIND #SAvsIND #TeamIndia #INDvSA #INDvsSA 🇮🇳 pic.twitter.com/6PsEbQHJan
— Dilbag Koundal ਦਿਲਬਾਗ ਕੌਂਡਲ 🇮🇳 (@dilbag_koundal) January 3, 2024