న్యూఢిల్లీ: తమ ఆందోళనలో ఇతరుల జోక్యం అవసరం లేదని, తమకు మద్దతు తెలిపితే సంతోషిస్తామని దేశ రాజధాని నడిబొడ్డున ఆందోళన చేస్తున్న రెజ్లర్ల తరఫున భజరంగ్ పునియా పేర్కొన్నాడు. పలువురు తమ ఆందోళన శిబిరాన్ని సందర్శిస్తున్నారని, అయితే కొందరు దీనిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని భజరంగ్ వ్యాఖ్యానించాడు. అయితే వారెవరన్నది తెలిపేందుకు అతడు నిరాకరించాడు.