SL vs PAK | కొలంబో: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన పాకిస్థాన్ జట్టు.. లంకపై తొలి టెస్టులో 4 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 131 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్నైట్ స్కోరు 48/3తో గురువారం ఐదో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్థాన్ 6 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ ఇమాముల్ హక్ (84 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్ సెంచరీతో అజేయంగా నిలువగా..
తొలి ఇన్నింగ్స్ డబుల్ సెంచరీ హీరో సౌద్ షకీల్ (30) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 4 వికెట్లు పడగొట్టాడు. లంక గడ్డపై తొలి ద్విశతకం బాదిన పాకిస్థాన్ ప్లేయర్గా రికార్డుల్లోకెక్కిన సౌద్ షకీల్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య సోమవారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది.