IPL | న్యూఢిల్లీ: ఐపీఎల్ రెండో దశ మ్యాచ్లు భారత్ బయట జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు శనివారం షెడ్యూల్ ప్రకటించనున్న నేపథ్యంలో లీగ్ నిర్వహణపై త్వరలో స్పష్టత రానుంది. అయితే ఇప్పటికే తొలి దశ షెడ్యూల్ విడుదల కాగా, మలి షెడ్యూల్ ఎన్నికలను అనుసరించి ఐపీఎల్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోనుంది. ఫ్రాంచైజీలు తమ ప్లేయర్ల పాస్ట్పోర్ట్లు తీసుకుని వీసాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే ఈ సారి ఐపీఎల్ విదేశాల్లో జరిగే చాన్స్ ఉంది.