గత మూడేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీలు చేయలేక విమర్శలపాలవుతున్న టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ.. గ్యాప్ తీసుకొని ఆసియా కప్తో మళ్లీ జట్టుతో చేరుతున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో కూడా ఆశించిన స్థాయిలో రాణించని కోహ్లీ.. ఆ తర్వాత వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనల సమయంలో విశ్రాంతి తీసుకున్నాడు.
మళ్లీ ఆసియా కప్తో జట్టుతో ఈ స్టార్ ప్లేయర్ కలుస్తున్న నేపథ్యంలో మాజీ ఆల్రౌండర్ రీతేందర్ సోధి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ కెరీర్లో ఈ ఆసియాకప్ చాలా కీలకం కానుందని, ఇంత ముఖ్యమైన టోర్నీ అతని కెరీర్లో మరొకటి లేదని అన్నాడు. కోహ్లీ లెజెండరీ ప్లేయర్ అని, కానీ ఫామ్ అతన్ని మోసం చేసిందని చెప్పాడీ మాజీ క్రికెటర్.
అలాగే టీమిండియా కోణం నుంచి చూసినా.. కోహ్లీ, రోహిత్ ఇద్దరూ రాణిస్తే ఆసియా కప్తోపాటు టీ20 ప్రపంచకప్ కూడా భారత్ హస్తగతం అవుతుందని అభిప్రాయపడ్డాడు. అందరూ కోహ్లీ రాణించాలనే కోరుకుంటున్నారన్నాడు. ఈ విషయంలో కోహ్లీ కూడా ఎలాంటి ఛాన్సులూ తీసుకుంటాడని తను అనుకోవడం లేదని, ప్రస్తుతం ఫామ్ కోసం అతను కఠోర శ్రమ చేస్తున్నాడని తెలిపాడు.
ఈ ఆసియా కప్లో కోహ్లీ మళ్లీ ఫామ్ అందుకోవాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ఒక్కసారి కోహ్లీ ఫామ్ అందుకుంటే మళ్లీ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదన్నాడు.