న్యూఢిల్లీ: ఐపీఎల్ మార్చి ఆఖరి వారంలో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఐపీఎల్ చైర్మన్ అరుణ్సింగ్ ధుమాల్ బుధవారం ఒక ప్రకటనలో ధృవీకరించాడు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశమున్న నేపథ్యంలో ఐపీఎల్ తేదీలపై ఒకింత ఆసక్తి నెలకొన్నది. దీనిపై అరుణ్ స్పందిస్తూ ‘సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వంతో కలిసి త్వరలో సంప్రదింపులు జరుపుతాం. ఎన్నికల షెడ్యూల్ గురించి వేచిచూస్తున్నాం. తేదీలను బట్టి ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయో దాన్ని అనుసరించి లీగ్ షెడ్యూల్ను రూపొందించాలనుకుంటున్నాం.మార్చి ఆఖరి నుంచి ఐపీఎల్ మొదలయ్యే అవకాశముంది’ అని అన్నాడు.