IND vs PAK | న్యూఢిల్లీ: అహ్మదాబాద్ వేదికగా భారత్, పాకిస్థాన్ వన్డే ప్రపంచకప్ మ్యాచ్కు యమా క్రేజ్ కొనసాగుతున్నది. ప్రతిష్ఠాత్మక టోర్నీలో దాయాదుల పోరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే మామూలు హోటళ్ల నుంచి మొదలుకుని స్టార్ హోటళ్ల వరకు రికార్డు రేంజ్లో ధరలు పలుకుతుండగా, తాజాగా విమాన టిక్కెట్ల ధరలకు రెక్కలొచ్చాయి. సాధారణంగా ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు ఒక్కొక్కరికి 2500 నుంచి 3 వేల వరకు ఉంటుంది. కానీ భారత్, పాక్ మ్యాచ్ దృష్ట్యా ఈ రేట్ ఏకంగా ఆరింతలు పెరిగిందట. అంటే ఒక్కో టిక్కెట్కు 15 వేల నుంచి 20 వేల వరకు ధర పలుకుతుందట. తమ వెబ్సైట్లో టిక్కెట్ల కోసం అన్వేషించే వారి సంఖ్య అమాంతం పెరిగిందని ఈజీ మై ట్రిప్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.