హైదరాబాద్, ఆట ప్రతినిధి: బెంగళూరు వేదికగా జరుగుతున్న ఇండియన్ గ్రాండ్ప్రి అథ్లెటిక్స్ టోర్నీలో రాష్ట్ర ప్లేయర్ల పతక జోరు కొనసాగుతున్నది.
శనివారం జరిగిన మహిళల 100మీటర్ల ఫైనల్ రేసులో రాష్ర్టానికి చెందిన గందె నిత్య 11.85 సెకన్ల టైమింగ్తో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సొంతం చేసుకుంది. నిత్యను జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ అభినందించారు.