హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): యునైటెడ్ స్టేట్స్ ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ (యూఎస్ఐఈఎఫ్) ఆధ్వర్యంలో ఈ నెల 26న ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించనున్నట్టు యూఎస్ కాన్సులేట్ ప్రకటించింది. హైదరాబాద్ హైటెక్ సిటీలోని నోవాటెల్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, అమెరికాకు చెందిన సుమా రు 40 యూనివర్సిటీలు ఈ ఫెయిర్లో పాల్గొంటాయని తెలిపింది.
అమెరికాలో బ్యాచిలర్స్, మాస్టర్స్, పీహెచ్డీ చేయాలనుకునే విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి ఫెయిర్కు హాజరు కావొచ్చని తెలిపింది. విద్యార్థులు https://bit.ly/ 23EdUSAFairEmailలో ముందుగానే పేరు నమోదు చేసుకోవాలని, పూర్తి వివరాలకు https://www.facebook. com/ EducationUSAindia, Educationusaindia @usief. org.inలో సంప్రదించాలని సూచించారు.