కటక్: అల్టిమేట్ ఖో ఖో(యూటీటీ) లీగ్లో తెలుగు యోధాస్కు చుక్కెదురైంది. సోమవారం జరిగిన తమ రెండో మ్యాచ్లో యోధాస్ 32-38తేడాతో చెన్నై క్విక్గన్స్ చేతిలో ఓటమిపాలైంది. చెన్నై ప్లేయర్ రామ్జీ కశ్యప్ 14పాయింట్లతో ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచాడు.
రామ్జీ మూడు స్కైడైవ్స్తో ఆకట్టుకున్నాడు. మరో మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ 41-30తో రాజస్థాన్ వారియర్స్పై విజయం సాధించింది.