సిడ్నీ: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడో టెస్టు ‘డ్రా’గా ముగిసింది. గత రెండు మ్యాచ్ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన దక్షిణాఫ్రికా.. ఆదివారం ఆఖరి రోజు పోరాడటంతో వైట్వాష్ నుంచి గట్టెక్కింది. తొలి రెండు టెస్టులు నెగ్గిన ఆస్ట్రేలియా 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఓవర్నైట్ స్కోరు 149/6తో చివరి రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 255 పరుగులకు ఆలౌటైంది. హర్మర్ (165 బంతుల్లో 47), కేశవ్ మహరాజ్ (53).. ఆసీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. అనంతరం ఫాలోఆన్ ఆడిన సఫారీలు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేశారు.