హైదరాబాద్, ఆట ప్రతినిధి: టీజీ20 లీగ్ను ఓటమితో ప్రారంభించిన నల్లగొండ నైట్స్ వరుసగా రెండో విజయంతో జోరందుకుంది. నితీశ్ రెడ్డి (42 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 81), గౌరవ్ రెడ్డి (33 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 80) దంచికొట్టడంతో 91 రన్స్ తేడాతో వరంగల్ వారియర్స్ను చిత్తు చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో తొలుత నల్లగొండ 20 ఓవర్లలో 259/5 స్కోరు చేసింది.
ఈ సీజన్లో ఇప్పటికి ఇదే అత్యధిక స్కోరు. అర్ఫాజ్ అహ్మద్ (14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 33) కూడా మెరిశాడు. అనంతరం వరుణ్ గౌడ్ (3/10), నిశాంత్ (3/42) దెబ్బకు వరంగల్ 14 ఓవర్లలో 168 రన్స్కే కుప్పకూలింది. కెప్టెన్ అమన్ రావు (46) టాప్ స్కోరర్. మరో మ్యాచ్లో ఖమ్మం ఏసెస్ 8 రన్స్ తేడాతో కరీంనగర్ డైమండ్స్పై గెలిచింది.