అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) పదో సీజన్ పోరును తెలుగు టైటాన్స్ పరాజయంతో మొదలుపెట్టింది. శనివారం జరిగిన లీగ్ తొలి మ్యాచ్లో టైటాన్స్ 32-38 తేడాతో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓటమిపాలైంది.
ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్లో గుజరాత్ తరఫున రైడర్ సోను 11 పాయింట్లతో విజృంభించగా, సహచరుడు రాకేశ్ డిఫెన్స్లో 5 పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు తెలుగు టైటాన్స్ కెప్టెన్ పవన్ షెరావత్ 11 పాయిట్లతో ఆకట్టుకున్నా..జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు.