హైదరాబాద్, ఆట ప్రతినిధి: హుసేన్సాగర్ వేదికగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర సెయిలింగ్ చాంపియన్షిప్లో యువ సెయిలర్ కొమరవెల్లి దీక్షిత అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. బాలికల జూనియర్ విభాగంలో తన చెల్లెలు కొమరవెల్లి లాహిరిని వెనుకకు నెడుతూ దీక్షిత హ్యాట్రిక్ విజయాలతో టాప్లోకి వచ్చింది. హైదరాబాద్కు చెందిన ఈ ఇద్దరు సిస్టర్స్ ఏడు రేసుల తర్వాత 17 పాయింట్లతో సమంగా నిలిచారు.
అయితే ఒక రేసు మినహాయించడంతో దీక్షిత పాయింట్ తేడాతో లాహిరిని అధిగమించించింది. శనివారం జరిగే రేసులో వీరిద్దరిలో విజేత ఎవరో తేలనుంది. పాలమూరుకు చెందిన బిందు రత్లావత్ కాంస్యాన్ని ఖాయం చేసుకుంది. బాలుర విభాగంలో వికారాబాద్కు చెందిన బన్నీ బొంగూరు నంబర్వన్లో ఉండగా, వినోద్ ఆ తర్వాత స్థానంలో ఉన్నాడు. శనివారం పోటీల ముగింపు కార్యక్రమం ఉంటుందని రాష్ట్ర సెయిలింగ్ అసోసియేషన్ పేర్కొంది.