న్యూఢిల్లీ: క్రికెట్లో టీ20 ఫార్మాట్కు తిరుగులేదని, వన్డేల భవిష్యత్తు ఎలా ఉంటుందో మాత్రం చేప్పలేమని భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. క్రికెట్ను విశ్వవ్యాప్తం చేసేందుకు టీ20 ఫార్మాట్ ఒక్కటే సరైన మార్గమన్నాడు. ఆగస్టులో మొదలయ్యే యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ఈపీటీఎల్)లో డబ్లిన్ గార్డియన్స్ జట్టుకు అశ్విన్ కెప్టెన్గా ఎంపికయ్యాడు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ రీఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఈ ఆటను గ్లోబల్ స్పోర్ట్గా మార్చేందకు ఈపీటీఎల్ కూడా దోహదం చేస్తుందన్నాడు.