న్యూఢిల్లీ : ఆస్ట్రేలియాతో జరుగనున్న అయిదు మ్యాచ్ల టి20 సిరీస్కు సోమవారం జట్టును ప్రకటించారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వైస్కెప్టెన్గా వ్యవహరించనున్నారు. తెలంగాణకు చెందిన తిలక్వర్మ జట్టులో చోటు దక్కించుకున్నాడు.23వ తేదీన విశాఖపట్నంలో తొలి మ్యాచ్తో ఆరంభమయ్యే సిరీస్కు వన్డే ప్రపంచకప్ ఆడిన జట్టునుంచి కేవలం ముగ్గురిని మాత్రమే ఎంపిక చేశారు. కాగా శ్రేయస్ అయ్యర్ తొలి మూడు మ్యాచ్లకు అందుబాటులో ఉండడని సెలెక్టర్లు తెలిపారు.
జట్టు : సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్(వైస్కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకు సింగ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివం దూబె, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ, అవేశ్ ఖాన్, ముకేష్ కుమార్, శ్రేయస్ అయ్యర్ (చివరి రెండు మ్యాచ్లకు).