లండన్: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ యాషెస్ సిరీస్ రెండో టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. టాస్ గెలిచిన ఇంగ్లండ్..ఆస్ట్రేలియాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఇదే అదనుగా ఆసీస్ దూకుడైన ఆటతీరుతో భారీ స్కోరు దిశగా దూసుకెళుతున్నది.
స్టీవెన్ స్మిత్(85 నాటౌట్), ట్రావిస్ హెడ్(77), వార్నర్(66) అర్ధసెంచరీలతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లకు 339 స్కోరు చేసింది. స్మిత్ టెస్టుల్లో తొమ్మిది వేల పరుగుల మైలురాయిని అందుకుని భారీ స్కోరుపై కన్నేశాడు. రాబిన్సన్కు ఏకైక వికెట్ దక్కింది.