న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక పారా షూటింగ్ ప్రపంచకప్లో తెలంగాణ యువ షూటర్ బానోత్ పావని కాంస్య పతకంతో మెరిసింది. మంగళవారం జరిగిన ఆర్11 మిక్స్డ్ టీమ్ 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్హెచ్2 ఈవెంట్లో పావని, శ్రీధర్ కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. కాంస్య పోరులో భారత్ 17-15 తేడాతో న్యూజిలాండ్పై విజయం సాధించింది.
ఇదే విభాగంలో బ్రెజిల్ స్వర్ణం, అమెరికా రజత పతకం గెలుచుకున్నాయి. మరోవైపు మిక్స్డ్ 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో రుద్రాంశ్ ఖండేల్వాల్(364), ఆకాశ్(346), సందీప్(340)తో కూడిన భారత త్రయం పసిడి పతకంతో మెరిసింది. కొరియా, చైనా రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాయి.