బెంగళూరు: దక్షిణాసియా ఫుట్బాల్ చాంపియన్షిప్లో ఇప్పటికే సెమీఫైనల్కు చేరిన భారత జట్టు.. చివరి గ్రూప్ మ్యాచ్ను ‘డ్రా’చేసుకుంది. మంగళవారం భారత్, కువైట్ మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో ‘డ్రా’గా ముగిసింది.
భారత కెప్టెన్, స్టార్ స్ట్రయికర్ సునీల్ ఛెత్రీ తొలి అర్ధభాగం ఇంజ్యూరీ టైమ్లో గోల్ చేసి భారత్కు ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఇంకాసేపట్లో మ్యాచ్ ముగుస్తుందనగా.. భారత ఆటగాడు అన్వర్ అలీ సెల్ఫ్గోల్తో మ్యాచ్ ‘డ్రా’అయింది.