IND vs BAN | మీర్పూర్: తొలి రెండు మ్యాచ్ల్లో తిరుగులేని ఆధిపత్యంతో బంగ్లాదేశ్పై టీ20 సిరీస్ చేజిక్కించుకున్న భారత మహిళల జట్టు.. నామమాత్రమైన మూడో మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మొదట భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 102 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (40; 3 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్ కాగా.. జెమీమా రోడ్రిగ్స్ (28) పర్వాలేదనిపించింది.
బంగ్లా బౌలర్లలో రాబియా ఖాన్ 3, సుల్తానా ఖాతూన్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 18.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. ఓపెనర్ షమీమా సుల్తానా (42) రాణించింది. భారత బౌలర్లలో మిన్ను మని, దేవిక వైద్య చెరో 2 వికెట్లు పడగొట్టారు. షమీమాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, హర్మన్ప్రీత్కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’అవార్డులు దక్కాయి.