ముంబై: తెలంగాణ యంగ్ ప్లేయర్ గొంగడి త్రిష దుమ్మురేపడంతో న్యూజిలాండ్ మహిళల అండర్-19 జట్టుతో ఆదివారం జరిగిన నాలుగో టీ20లో భారత అండర్-19 జట్టు ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మన అమ్మాయిలు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేశారు. ఓపెనర్గా బరిలోకి దిగిన త్రిష (39; 6 ఫోర్లు, ఒక సిక్సర్) జట్టులో అందరికంటే ఎక్కువ పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 18.3 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌటైంది.