న్యూఢిల్లీ: ఈ నెల 15 నుంచి జరగనున్న ఐదు దేశాల మహిళ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు సవిత పునియా సారథ్యంలో బరిలోకి దిగనుంది. జర్మనీ, ఐర్లాండ్, స్పెయిన్, బెల్జియం పాల్గొంటున్న ఈ టోర్నీలో కోసం భారత హాకీ సమాఖ్య శుక్రవారం 22 మందితో కూడిన జట్టును ప్రకటించింది.
స్పెయిన్ వేదికగా జరుగనున్న ఈ టోర్నీ కోసం అనుభవజ్ఞులు, యంగ్ ప్లేయర్లతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు భారత కోచ్ షాప్మన్ పేర్కొన్నాడు. వచ్చే ఏడాది ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో ప్రతీ సిరీస్ ముఖ్యమైందేనని కోచ్ అన్నాడు. గోల్ కీపర్ సవితతో పాటు జట్టులో వందన కటారియా, నిక్కీ, ఉదిత, గుర్జీత్, సలీమ, నేహా, నవ్నీత్, జ్యోతి, దీపిక, షర్మిల చోటు దక్కించుకున్నారు.