దోహా : ప్రపంచకప్ ఫుట్బాల్ ఆసియా క్వాలిఫయింగ్ పోటీలలో భాగంగా మంగళవారం ఖతార్తో జరిగిన పోరులో భారత జట్టు 0-3తో ఓడిపోయింది. ఆట ఆరంభమైన నాలుగో నిమిషంలోనే ముస్తఫా ఖతార్కు ఆధిక్యం అందించాడు. ఆపై విరామం వరకు మరో గోల్ కాకుండా భారత డిఫెండర్లు ప్రత్యర్థిని అడ్డుకున్నారు.
ద్వితీయార్ధం 46వ నిమిషంలో మోయిజ్ అలీ చేసిన గోల్తో ఖతార్ స్కోరు రెట్టింపయింది. ఇక 86వ నిమిషంలో అబ్దురిశాగ్ హెడర్తో గోల్ పోస్ట్లోకి కొట్టడంతో 3-0తో ఖతార్ విజయం సాధించింది.