హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు జరుగనున్న ఈ మెగాఈవెంట్లో దేశవ్యాప్తంగా 337 మంది ప్లేయర్లు పోటీపడుతున్నారు. వివిధ వయసు విభాగాలతో నిర్వహించే టోర్నీలో తొలిసారి మహిళల సింగిల్స్ను ప్రవేశపెట్టారు. అంతర్జాతీయ స్థాయి సీడెడ్ ప్లేయర్లు పోటీపడుతున్న టోర్నీని శుక్రవారం ఎల్బీ స్టేడియంలో నార్త్జోన్ ఐజీపీ చంద్రశేఖర్రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు నరసింహారెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, కోఆర్డినేటర్ హరికృష్ణారెడ్డి, ఎఫ్ఎంసీ అధ్యక్షుడు వెంకటప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.