IPL | న్యూఢిల్లీ : వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్-17కు దూరమైన రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా స్థానాన్ని ఫ్రాంచైజీ భర్తీ చేసింది. అతడి స్థానంలో దేశవాళీలో ముంబై తరఫున ఆడే ఆఫ్ స్పిన్నర్ తనుష్ కొటియాన్ను ఎంపిక చేసింది. ఇటీవలే ముగిసిన ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో భాగంగా కొటియాన్.. సెమీస్, ఫైనల్స్లో బౌలింగ్తో పాటు బ్యాటింగ్తోనూ మాయ చేసి ఆ జట్టు విజయాలలో కీలకపాత్ర పోషించాడు.
రూ. 20 లక్షల కనీస ధరతో అతడు రాజస్థాన్తో చేరాడు. మరోవైపు బైక్ ప్రమాదంతో తాజా ఎడిషన్కు దూరమైన జార్ఖండ్ గిరిజన తెగకు చెందిన కుర్రాడు, వేలంలో రూ. 3.6 కోట్లు దక్కించుకున్న రాబిన్ మింజ్ స్థానంలో గుజరాత్ టైటాన్స్.. కర్ణాటక ఆటగాడు బీఆర్ శరత్ను రూ. 20 లక్షల బేస్ ప్రైస్తో భర్తీ చేసింది.