పుణె: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్(యూటీటీ) నాలుగో సీజన్కు గురువారం నుంచి తెరలేవనుంది. ఈ నెల 30వ తేదీ వరకు జరిగే టోర్నీలో మొత్తం ఆరు జట్లు బెంగళూరు స్మాషర్స్, చెన్నై లయన్స్, దబాంగ్ ఢిల్లీ, గోవా చాలెంజర్స్, పుణెరి పల్టాన్, యూ ముంబా బరిలోకి దిగుతున్నాయి. పుణెలోని భలేవాడీ స్టేడియం మ్యాచ్లకు ఆతిథ్యమివ్వనుంది.
కరోనా వైరస్ విజృంభణతో పాటు పలు కారణాల వల్ల నాలుగేండ్ల తర్వాత జరుగుతున్న యూటీటీ లీగ్పై భారీ అంచనాలు ఉన్నాయి. లీగ్లో ప్రతీ రోజు ఐదు మ్యాచ్లు జరుగనున్నాయి. ఆరు జట్లలో మొత్తం 36 మంది ప్లేయర్లు ఉన్నారు. ఒక్కో జట్టులో నలుగురు భారత ప్లేయర్లు, ఇద్దరు అంతర్జాతీయ ఆటగాళ్లకు చోటు కల్పించారు.