హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ నాలుగో సీజన్ పోటీలు గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ గోల్ఫ్ కోర్స్లో ఉత్కంఠగా సాగుతున్నాయి. సోమవారం జరిగిన మూడో రౌండ్లో రఫ్రైడర్స్ 92 పాయింట్లతో గ్రూపు-బిలో అగ్రస్థానంలో నిలిచింది.
ఆరుగురు గోల్ఫర్లు అత్యధికంగా 32 పాయింట్లు ఖాతాలో వేసుకున్నారు. గ్రూపు-ఎలో ఎలో స్టోనెక్స్, మైసా 83 పాయింట్లు దక్కించుకున్నాయి. గ్రూపు-సిలో ఎజైల్ 81 పాయింట్లు, గ్రూపు-డిలో సింతోకెమ్ 84 పాయింట్లతో టాప్లో నిలిచాయి. మూడు రౌండ్లు పూర్తయ్యే సరికి టీమ్ అల్ఫా 482 పాయింట్లతో అగ్రభాగాన కొనసాగుతున్నది.