హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ గురుకులాల ఆధ్వర్యంలో జరుగుతున్న తొలి ఆల్ఇండియా ‘బిలో 1600 రేటింగ్’ చెస్ టోర్నమెంట్ జోరుగా సాగుతున్నది. కోట్ల విజ య్ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈ టోర్నీలో ఐదు రౌండ్లు ముగిసే సరికి కంది సాయి సంతోష్ కార్తీక్ (5 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
అతడితో పాటు మరో 12 మంది ప్లేయర్లు ఐదేసి పాయింట్లతో ఉన్నా.. టై బ్రేక్స్లో మెరుగైన ప్రదర్శనతో సాయి సంతోష్ టాప్లో ఉన్నాడు. ఈ టోర్నీలో దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన 735 మంది పురుషులు, 180 మంది మహిళలు పోటీపడుతున్నారు.