హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ (హెచ్పీఆర్సీ) ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి ఈక్వెస్ట్రియన్ చాలెంజ్ టోర్నీ జరగనుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్లో రాష్ట్రంలోని హార్స్ రైడర్లు హ్యాక్స్, డ్రెస్సేజ్, షో జంపింగ్ విభాగాలలో తలపడనున్నాని క్లబ్ ప్రెసిడెంట్ చైతన్య కుమార్ తెలిపారు.
ఓపెన్ కేటగిరీలో 80 సెంమీ., 90 సె.మీ, 105 సె.మీ షో జంపింగ్ విభాగాల్లో జూనియర్ నుంచి సీనియర్ ఏజ్ గ్రూప్ రైడర్లు తమ సత్తా చాటుకునేందుకు ఇది మంచి వేదిక అవుతుందన్నారు.