కరాచీ: దూకుడే మంత్రంగా సాగుతున్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టు.. పాకిస్థాన్పై టెస్టు సిరీస్ క్లీన్స్వీప్ చేసేందుకు చేరువైంది. ఇప్పటికే తొలి రెండు టెస్టులు నెగ్గి సిరీస్ కైవసం చేసుకున్న ఇంగ్లిష్ జట్టు.. కరాచీ పోరులో విజయానికి 55 పరుగుల దూరంలో నిలిచింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 112 పరుగులు చేసింది.
డకెట్ (50 బ్యాటింగ్), క్రాలీ (41) రాణించారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 21/0తో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్థాన్.. 216 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (54), షకీల్ (53) అర్ధసెంచరీలతో రాణించగా.. ఇంగ్లండ్ బౌలర్లలో రేహాన్ అహ్మద్ 5 వికెట్లు పడగొట్టాడు.