హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పంచకుల(హర్యానా) వేదికగా జరిగిన 26వ జాతీయ అటవీ క్రీడోత్సవాల్లో తెలంగాణ ఉద్యోగులు పతక జోరు కనబరిచారు. వివిధ క్రీడా విభాగాల్లో ఎనిమిది స్వర్ణ పతకాలు, రెండు రజత, ఆరు కాంస్య పతకాలు దక్కించుకుని ఔరా అనిపించారు.
బిలియర్డ్స్లో ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సోనీ బాలాదేవి రెండు స్వర్ణ పతకాలతో మెరిసింది. అథ్లెటిక్స్లో ఖాజా, సునీత, సాంబయ్య, స్విమ్మింగ్లో కిష్టాగౌడ్, సక్రు, క్యారమ్స్లో ఘాజీ కమాలుద్దీన్ పతకాలు సాధించగా, చెస్, వాలీబాల్, బ్యాడ్మింటన్లో అటవీ ఉద్యోగులు ప్రతిభ కనబరిచారు. పతకాలు సాధించిన ఉద్యోగులను మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రత్యేకంగా అభినందించారు.