న్యూఢిల్లీ: క్రికెట్ అభిమానులకు శుభవార్త. హైదరాబాద్ నగరం మరోమారు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్కు వేదిక కాబోతున్నది. వచ్చే ఏడాది తొలి మూడు నెలలు టీమ్ఇండియా బిజీ షెడ్యూల్తో గడపనుంది. ఇందుకు సంబంధించిన తేదీలు, వేదికలను గురువారం బీసీసీఐ వెల్లడించింది. న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా జనవరి 18న హైదరాబాద్లో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే జరుగనుంది.
రెండో, మూడో వన్డేలకు రాయ్పూర్, ఇండోర్ ఆతిథ్యమివ్వనున్నాయి. కివీస్ కంటే ముందు శ్రీలంకతో భారత్ జనవరి 3 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. మరోవైపు బోర్డర్-గవాస్కర్ సిరీస్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్ జరుగుతుంది. ఆ తర్వాత ఇరు జట్లు మూడు వన్డేల్లో ముఖాముఖి తలపడుతాయి. జనవరి నుంచి మార్చి ఆఖరి వరకు టీమ్ఇండియా ఆరు టీ20లు, తొమ్మిది వన్డేలు, నాలుగు టెస్టుల్లో బరిలోకి దిగనుంది.