హైదరాబాద్, ఆట ప్రతినిధి: సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ పూల్ వేదికగా జరుగుతున్న 8వ జూనియర్, సబ్ జూనియర్ అంతరజిల్లాల స్విమ్మింగ్ టోర్నీలో శివానీ కర్ర పసిడి పతకంతో మెరిసింది. సోమవారం జరిగిన బాలికల 100మీటర్ల బటర్ఫ్లై ఈవెంట్లో శివానీ 1:14:03 టైమింగ్తో అగ్రస్థానంలో నిలిచింది.
విలక్షణ పటేల్, అభినయ వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. మరోవైపు బాలిక 50మీ ఫ్రీ స్టయిల్లో శిజు స్వర్ణం ఖాతాలో వేసుకుంది. విదుశి, వేదా అశ్రిత..రజత, కాంస్యాలు సొంతం చేసుకున్నారు.