హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కోల్కతా వేదికగా వచ్చే నెల 3 నుంచి132వ ఎడిషన్ డ్యురాండ్ ఫుట్బాల్ టోర్నీ ప్రారంభం కానున్నది. భారత సైన్యంలోని త్రివిధ దళాల క్రీడాకారులు ఈ ప్రతిష్ఠాత్మక ఫుట్బాట్ టోర్నీలో పోటీపడనున్నారు.
ఈ టోర్నీకి సంబంధించిన దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో కమాండెంట్ ఎయిర్ మార్షల్ బి చంద్రశేఖర్ గురువారం కప్ను ఆవిష్కరించారు. ఆగస్టు 3న కోల్కతాలో మొదలయ్యే టోర్నీ సెప్టెంబర్ 3న ఫైనల్ మ్యాచ్తో ముగియనుంది. ఆసియాలోనే పురాతన ఫుట్బాల్ టోర్నీగా డ్యూరాండ్ కప్నకు మంచి గుర్తింపు ఉంది.